బడుగులపైకి బుల్డోజర్‌ | Janasena corporator Murthy Yadav is anarchy in Visakhapatnam | Sakshi
Sakshi News home page

బడుగులపైకి బుల్డోజర్‌

Aug 4 2024 5:45 AM | Updated on Aug 4 2024 5:45 AM

Janasena corporator Murthy Yadav is anarchy in Visakhapatnam

విశాఖలో జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ అరాచకం 

చిరు వ్యాపారుల 500 దుకాణాలు కూల్చివేత 

వారి షెడ్లనూ పెకిలించిపారేసిన వైనం 

రోడ్డుపై బైఠాయించిన బాధితులు  

సాక్షి, విశాఖపట్నం: రోడ్డు పక్కన చిరు వ్యాపా­రాలు చేసుకునే బడుగులపై జనసేన కార్పొరేటర్‌ తన ప్రతాపాన్ని చూపించారు. అధికారమే అండగా వారి దుకాణాలపైకి బుల్డోజర్‌ను పంపి కూల్చి­వేయించారు. వారి పొట్టకొట్టి రోడ్డున పడేలా చేశారు. గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 22వ వార్డు పరిధిలో పిఠాపురం కాలనీలో ఉన్న సుమారు 500 చిన్నచిన్న దుకాణాల్ని శనివారం ఉదయం అధికారులు కూల్చిపారేశారు. 

పీతల మూర్తి యాదవ్‌ 2021లో కార్పొరేటర్‌గా గెలిచిన­ప్పటి నుంచి ఈ వ్యాపారులతో నిరంతరం గొడవ­లకు దిగుతుండేవారు. ఎప్పటికైనా మీ షాపులన్నీ తొలగించేస్తా­నంటూ సవాల్‌ విసిరారు. గత వైఎస్సా­ర్‌సీపీ ప్రభు­త్వ హయాంలో చిరు దుకా­ణా­­లపై ఫిర్యాదు చేసినా అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసు­కున్న గత ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. దుకా­ణాలు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  

చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా పిటిషన్‌
ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ రెచ్చిపోయారు. చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. కోర్టు ఆదేశాలు వచ్చాక.. చిరు వ్యాపారులకు ఎలాంటి నోటీసులివ్వకుండానే దుకాణాలు తొలగింపు ప్రక్రి­యని మొదలు పెట్టేశారు. ఏయూ గేట్‌ని ఆనుకొని ఉన్న షాపుల్ని బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు. మరికొన్ని చోట్ల చిరు వ్యాపారుల షెడ్లను పెకిలించిపారేశారు.

దుకాణాలను కోల్పో­యిన­వారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించగా జీవీఎంసీ అధికారులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో దుకాణాల తొలగింపు ప్రక్రియని నిలిపివేశారు. ఎమ్మెల్యే పనులు నిలిపేశారని తెలుసుకున్న మూర్తి యాదవ్‌.. జీవీఎంసీ అధికారులకు ఫోన్‌ చేసి హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసులు పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. బాధిత వ్యాపారులు పిఠాపురం కాలనీ రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినదించారు.

పన్ను చెల్లించినప్పుడు అక్రమమని గుర్తులేదా?
నేను ఇక్కడ 30 ఏళ్లుగా సెలూన్‌ నడు­పు­తున్నా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహి­స్తున్నా. ట్రాఫిక్‌కు కూడా ఏ ఇబ్బందీ లేదు. జీవీఎంసీకి పదేళ్ల నుంచి పన్నులు కూడా కడుతున్నా. ఇప్పుడు జన­సేన కార్పొరేటర్‌ చెప్పారని దుకాణాలు తొల­గి­స్తున్నారు. నా దుకాణం ఏర్పాటు అక్రమ­మైతే పన్నులు ఎందుకు కట్టించుకున్నారో అధికారులు, కార్పొరేటర్‌ చెప్పాలి.    – కె.వెంకటరమణ,  సెలూన్‌ షాప్‌ నిర్వాహకుడు

నోటీసులివ్వకుండా కూల్చారు 
నెల్లూరు నుంచి వలస వచ్చి.. రెండేళ్లుగా ఇక్కడ టిఫిన్‌ దుకాణాన్ని నడుపుతు­న్నాం. ఇంతకు ముందు.. కొ­ంచెం లోపలకు పెట్టుకొండి.. లేదంటే పగలగొట్టేస్తామని జనసేన కార్పొరే­టర్‌ మూర్తి చెప్పారు. మూడు రోజుల నుంచి చిన్న చిన్న మరమ్మ­తులు చేస్తున్నాం. ఇప్పుడు నోటీ­సులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారు. ఈ దుకా­ణంలో మా కుటుంబంతో పాటు మరో ఏడు­గురు పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పు­డు అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తా­రా? – కస్తూరయ్య, టిఫిన్‌ దుకాణం నిర్వాహకుడు

Advertisement
 
Advertisement
Advertisement