ప్లాస్మా దానం చేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ | Jagan Mohan Reddy's Principal Secretary Praveen Prakash Donated Plasma | Sakshi
Sakshi News home page

ప్లాస్మా దానం చేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Sep 9 2020 2:34 PM | Updated on Sep 9 2020 2:42 PM

 Jagan Mohan Reddy's Principal Secretary Praveen Prakash Donated Plasma - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ స్టేట్ కోవీడ్ హాస్పటల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్లాస్మా దానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ప్లాస్మా డొనేట్ చేయడం చాలా సులువు ,రక్తదానం చేసినట్లు ప్లాస్మా చేయవచ్చు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో 2001లో ఒక చిన్నారికి యాక్సిడెంట్ అయితే రక్తదానం చేశాను. చాలాకాలం తర్వాత  ప్లాస్మా డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం హాస్పిటల్ లో 300 మంది చికిత్స పొందుతున్నారు  వారి ప్రాణాలు కాపాడడానికి ప్లాస్మా దానం చేయడానికి కోవిడ్ వారియర్స్ ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.  

 

చదవండి: ప్లాస్మా దానానికి భయపడక్కర్లేదు

Advertisement
 
Advertisement
Advertisement