ఠారెత్తించిన ఎండలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో శుక్రవారం కూడా ఎండలు ఠారెత్తించాయి. వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్రంపై నుంచి తేమగాలుల రావడంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.