రాష్ట్రంలో తొలిసారి ఓటు వేయనున్న గవర్నర్‌ దంపతులు

Governor Biswabhusan Harichandan couple will be voting first time in AP - Sakshi

సాక్షి, అమరావతి: గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు రాష్ట్రంలో తొలిసారి బుధవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. రాజ్‌భవన్‌ సమీపంలో ఉన్న సీవీఆర్‌జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ దంపతులు బుధవారం ఉదయం 11 గంటలకు ఓటు వేస్తారని గవర్నర్‌ కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top