వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు | Government Chief Secretary Jawahar Reddy order to officers: ap | Sakshi
Sakshi News home page

వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు

Mar 22 2024 5:50 AM | Updated on Mar 22 2024 5:50 AM

Government Chief Secretary Jawahar Reddy order to officers: ap - Sakshi

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకూడదు 

రూ.115 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులన్నీ పూర్తిగా నీటితో నింపండి

ఎక్కడైనా సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా రోజూ తాగునీటి సరఫరా

1904 కాల్‌సెంటర్‌ ద్వారా తాగునీటిపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించండి

అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్‌ నెలా­ఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవ­స­రమైన చర్యలు తీసుకోవాలని అధికారు­లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ ­జవహర్‌­రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచి­వా­లయంలో ఆయన వివిధ విభాగాల అధికా­రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా­డుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చి­న మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిప­దికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. స­మ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగు­నీటి పథకాల నిర్వ­హ­ణపై ప్రత్యే­క దృష్టి సారించాలని సూచించా­రు.

వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్‌ సహా ఇతర తాగునీటి వన­రులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్య­లు తీసుకో­వా­లని సూ­చించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాం­కర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసు­కోవా­లని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొ­క­సారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్ష­ణమే పరిష్కరించాలని ఆదేశించారు.

పశువులకు కూడా తాగునీటి ఇ­బ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు. పంచాయతీ­రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్‌ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అ­ను­మతి మంజూరు చేశామని తెలిపారు.

మున్సి­పల్‌ పరిపాలన శాఖ కమిషనర్‌ శ్రీకేశ్‌ బాలాజీ­రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజు­కు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగు­నీ­టి­ని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెను­గొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజు­ల­కు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నా­మని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగి­న చర్య­లు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్న­తా­ధికారులు ఎస్‌ఎస్‌ రావత్, కేవీవీ సత్య­నారా­యణ, ఆర్‌వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement