
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.
దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.