gold trader
-
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
సైనికుడే నేరస్తుడిగా మారి..
విజయనగరం క్రైమ్: ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడు వ్యాపారిని బెదిరించి పోలీసులకు పట్టుబడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్పీ బి.రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామానికి చెందిన చందనా పల్లి రాజేశ్వరరావు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సె లవుపై వచ్చిన అతడు స్థలం కొనుగోలు, విక్ర యంలో రూ.22 లక్షలు నష్టపోయాడు. దాన్ని భర్తీ చేసుకునేందుకు మావోయిస్టు నాయకుడిగా అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్లో కొనుగోలు చేసిన పిస్టల్తో పార్వతీపురానికి చెందిన బంగారు వ్యాపారి ఇందుపూరు చినగుంపస్వామి అలియాస్ బాబు ఇంటి కిటికీ అద్దాలపై ఈ నెల 6న అర్ధరాత్రి కాల్పులు జరిపాడు. మరుసటి రోజు వ్యాపారికి ఫోన్ చేసి జార్ఖండ్ మావోయిస్టు కమాండర్గా పరిచయం చేసుకున్నాడు. కాల్పులు జరిపినది తనేనని, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రూ.1.5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిందితుడు వ్యాపారికి ఆదివారం ఫోన్చేసి డబ్బును విక్రం పురం–డంగభద్ర గ్రామాల మధ్యలోని కొండ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పాడు. పోలీసులు మాటువేసి నిందితుడిని పట్టుకున్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
కడప అర్బన్ : కడపలో కొంత కాలంగా జరుగుతున్న చోరీలను అరికట్టేందుకు కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ రమేష్, తమ సిబ్బందితో కలిసి దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరిని గురువారం వైవీ స్ట్రీట్లోని బంగారు నగల దుకాణం ఎదుట అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపలో 14 చోట్ల దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తుడు ఆవుల సాయిప్రసాద్రెడ్డి, అస్లంబాషా, మాబు, చాన్బాషా, ముబారక్, మహ్మద్ ఖలీద్, చంద్ర, షేక్ ఈలు ఉన్నారు. 2016 జూన్ 22న బ్రాహ్మణ వీధిలోని ఓ ఇంటిలో జరిగిన నేరంపై విచారణ చేస్తుండగా ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజిలో.. నేరస్తులు ఆటోలో వచ్చి దొంగతనం చేసి అదే వాహనంలో పారిపోవడం నిక్షిప్తమైంది. అప్పటి నుంచి గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. వీరు కడపలో 14 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, 780 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 81 వేలు, మూడు టీవీలు, ఒక మానిటర్, సీపీయూ, రెండు హ్యాండీకామ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన వస్తువులను బంగారు వ్యాపారి హుసేన్బాషాకు ఇస్తున్నట్లు విచారణలో తెలియడంతో అతన్ని కూడా అరెస్టు చేశామని సీఐ తెలిపారు. సమావేశంలో వన్టౌన్ సీఐ రమేష్, ఎస్ఐ ప్రతాప్రెడ్డి, ఏఎస్ఐ నౌషాద్, సిబ్బంది పాల్గొన్నారు.