అర్థించినా ఆలకించని పవన్‌ | Family Members Of Missing Girl Protest For Lack Of Justice In Pawan Kalyan Kakinada Meeting | Sakshi
Sakshi News home page

అర్థించినా ఆలకించని పవన్‌

Jun 27 2025 5:50 AM | Updated on Jun 27 2025 9:26 AM

Family members protest lack of justice

తమ కుమార్తె ఆత్మహత్యపై న్యాయం జరగలేదని కుటుంబ సభ్యుల నిరసన 

బహిరంగ సభలో విద్యార్థిని ఫొటోతో ప్రదర్శన 

పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ 

సాక్షి, రాజమహేంద్రవరం : ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పలు సందర్భాల్లో ఉపన్యాసాలు 
ఇచి్చన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ‘తమ ఆడబిడ్డకు ఇంకా న్యాయం జరగలేదన్నా.. న్యాయం చేయండి’ అని అభ్యర్థించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌ వద్ద గురువారం చోటుచేసుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికికి చెందిన ఓ టెన్త్‌ విద్యార్థిని ఆర్నెల్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలేమిటో నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. 

దీంతో మూడునెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చిన పవన్‌కళ్యాణ్‌కు బాధితులు ఎయిర్‌పోర్టు వద్ద కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిoచారు. అయినా ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడంతో గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు వచ్చారు. ‘ఇంకా న్యాయం జరగలేదన్నా..’ అంటూ ఫ్లెక్సీ చూపిస్తూ నిరసన తెలిపారు. 

కొద్దిసేపు అక్కడే ఉన్నా వారిని పవన్‌ గమనించలేదు. దీంతో పోలీసులు పవన్‌ను కలిసే ఏర్పాటుచేస్తామని వారిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. పవన్‌ ప్రసంగం అయిన వెంటనే మాట్లాడిస్తామని చెప్పడంతో వారు ఫ్లెక్సీ కిందకు దింపేశారు. కానీ, సభ పూర్తయిన వెంటనే పవన్‌ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధితులు వెనుదిరిగారు.  

జనసేన కార్యకర్తల వీరంగం.. 
సభలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్‌కళ్యాణ్‌ ప్రసంగిస్తుండగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి చిందులకు సభలోని కుర్చీలు విరిగిపోయాయి.  

‘ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌’..!
సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగంలో ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌’ అని పలికారు. దీంతో జనసేన కార్యకర్తలు అరవడం ప్రారంభించారు. పక్కనున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అని చెప్పడంతో.. తిరిగి డిప్యూటీ సీఎం అని పురందేశ్వరి అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement