
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కాలి పొగలు వ్యాపించడంతో..
సాక్షి, విజయవాడ: మంగళగిరి(గుంటూరు)లోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వస్తున్న కథనాలపై ట్రస్ట్ స్పందించింది. జరిగింది స్వల్ప ప్రమాదమేనని, ఆ ఘటనతో ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రి హెల్త్ కేర్ ట్రస్ట్. మంగళగిరి డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కాలి పొగలు వ్యాపించడంతో ఉద్యోగులని బయటకి పంపించాం. దీని వలన ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు అని ఆ ప్రకటనలో పేర్కొంది.