మంచు.. ఎండ.. వాన! ఏజెన్సీలో విభిన్న వాతావరణం | Diverse Weather In Visakhapatnam Agency Area | Sakshi
Sakshi News home page

మంచు.. ఎండ.. వాన! ఏజెన్సీలో విభిన్న వాతావరణం

Apr 26 2022 1:24 PM | Updated on Apr 26 2022 1:35 PM

Diverse Weather In Visakhapatnam Agency Area - Sakshi

పాడేరులో ఎండకు గొడుగును ఆశ్రయించిన బాలింత  

సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు నెలవైన మన్యం జిల్లాలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. మండు వేసవిలోనూ మన్యం వాసులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.


                పాడేరులో కురుస్తున్న వర్షం

ఆ సమయంలో అధిక ఎండకు తాళలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులను ఆశ్రయిస్తున్నారు. 35 నుంచి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం  చల్లబడుతోంది. ఉన్నపళంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజూ ఇదే పరిస్థితి నెలకుంటోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, కొయ్యూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


 పాడేరు–జి.మాడుగుల రోడ్డులోని పొగమంచు  
 

Advertisement
 
Advertisement
Advertisement