-
మంచు.. ఎండ.. వాన! ఏజెన్సీలో విభిన్న వాతావరణం
సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు నెలవైన మన్యం జిల్లాలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. మండు వేసవిలోనూ మన్యం వాసులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పాడేరులో కురుస్తున్న వర్షం ఆ సమయంలో అధిక ఎండకు తాళలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులను ఆశ్రయిస్తున్నారు. 35 నుంచి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. ఉన్నపళంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజూ ఇదే పరిస్థితి నెలకుంటోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, కొయ్యూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాడేరు–జి.మాడుగుల రోడ్డులోని పొగమంచు -
వర్షం కురిసింది.. మన్యం మురిసింది
♦ చల్లబడ్డ ఏజెన్సీ వాతావరణం ♦ వేసవి తీవ్రత నుంచి ఉపశమనం ♦ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పాడేరు : మన్యంలో వర్షాలు ఊపందుకుంటున్నాయి. నాలుగైదు రోజులుగా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్యం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మన్యంలో ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోయారు. హుద్హుద్ తుపాను ప్రభావంతో లక్షలాది చెట్లు నేలకొరగడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఈ సారి వేసవి తీవ్రత అధికంగా కనిపించింది. 15 రోజులుగా మన్యంలో మండిన ఎండల వల్ల చింతపల్లి, కొయ్యూరు, పాడేరు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో వడదెబ్బకు గురై పలువురు మృతి చెందారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పిల్లలు అవస్థలు పడ్డారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో మధ్యాహ్నం గంటకు పైగా భారీ వర్షం కురవడంతో వేసవి తాపం నుంచి జనానికి పూర్తి ఉపశమనం కలిగింది. బాకూరు, హుకుంపేట, పాడేరు పరిసరాల్లో పిడుగులు, వడగళ్లతో వర్షం కురిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement