సు‘దూర’ విద్య! | Distribution of Open School Society books: Andhra pradesh | Sakshi
Sakshi News home page

సు‘దూర’ విద్య!

Dec 30 2024 4:50 AM | Updated on Dec 30 2024 4:50 AM

Distribution of Open School Society books: Andhra pradesh

 ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పుస్తకాల పంపిణీలో జాప్యం

గుంటూరు ఎడ్యుకేషన్‌: దూరవిద్య ద్వా­రా పదో తరగతి, ఇంటర్‌ కోర్సు­ల్లో చేరిన అభ్యర్థు­లకు ప్రభుత్వం చుక్కలు చూపి­స్తోం­ది. ఆగస్టులో అడ్మి­షన్‌ పొందిన అ­భ్య­ర్థులకు డిసెంబర్‌ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్త­కాలు పంపిణీ చేయకుండా ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (ఏపీఓఎస్‌­ఎస్‌) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

2024­–­25 విద్యాసంవత్సరానికి ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నిర్వహించిన అడ్మిషన్ల ద్వా­రా టెన్త్, ఇంటర్‌ కోర్సుల్లో  దాదాపు లక్ష మంది ప్రవేశం పొందారు. వీరికి వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరుగుతాయి. వీరందరికీ ప్రస్తుతం గుంటూరు­లోని ఏపీఓఎస్‌ ఎస్‌ రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠ్య పుస్తకాలను పోస్టాఫీసుల ద్వారా పంపుతున్నారు. డిసెంబర్‌ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికి 30 వేల మందికి పైగా పుస్తకాలు అందించినట్టు ఏపీఓఎస్‌ఎస్‌ డైరెక్టర్‌ నరసింహారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement