కాకినాడలో సైబర్‌ స్కామర్లు | Cyber ​​scammers in Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో సైబర్‌ స్కామర్లు

Jun 7 2025 2:50 AM | Updated on Jun 7 2025 2:50 AM

Cyber ​​scammers in Kakinada

అమాయకులకు డబ్బు ఎర వేసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు 

దుబాయ్‌ కేంద్రంగా కాకినాడ వాసి దందా

కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించు­కుని సైబర్‌ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్‌ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్‌ కా­ర్యా­లయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్‌ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయ­ణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్‌బుక్, చెక్‌బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్‌ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చు­తో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. 

ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్‌ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్‌కిరణ్‌కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవా­డు. కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్‌ అప్పగించి రెండు నెలలైంది. లోన్‌ కోసం కాకినాడలోని బ్యాంక్‌ ఆఫ్‌ కర్ణాటకకు వెళ్లాడు. 

బ్యాంక్‌ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.­50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్ల­డైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్‌ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్‌కిరణ్‌ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్‌ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్‌లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్‌ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. 

ఇందుకు ఉదయ్‌ కిరణ్‌కు ఖాతాకు రూ.­30 వేల చొప్పున పుట్టారామ్‌ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్‌ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చి­మ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతా­లు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసిన­ట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్‌ చంద్ర, సత్యనారాయణ­ను అరెస్టు చేయగా ఉదయ్‌కిరణ్‌ పరారీలో ఉన్నా­డు. పుట్టారామ్‌ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement