ఏపీలో 11,069 మంది డిశ్చార్జ్‌ 

Coronavirus: 11069 people have been discharged from hospitals - Sakshi

ఇప్పటి వరకు కోలుకున్నవారు 4,46,716 మంది 

తాజాగా 9,999 మందికి పాజిటివ్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,069 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,46,716కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 71,137 మందికి పరీక్షలు నిర్వహించగా, 9,999 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 44,52,128కి చేరగా, మొత్తం పాజిటివ్‌ కేసులు 5,47,686కి చేరాయి. తాజాగా 77 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 4,779కి చేరింది. యాక్టివ్‌ కేసులు 96,191 ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top