సాక్షి,నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది. శ్రీశైల ఆలయ చరిత్రలో మొదటిసారిగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని జరిపించలేదు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు స్వామి అమ్మ వార్లకు నిర్వహించాల్సిన వాహనసేవ, గ్రామోత్సవాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు.
క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పురవీధుల్లో జరగాల్సిన ఉత్సవాన్ని ఆలయ ప్రాంతానికి పరిమితం చేశారు. గ్రామోత్సవం జరగ కపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


