నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Cm Jagan Review On Niti Aayog Governing Council Meeting - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై  నీతిఆయోగ్‌ పాలక మండలి చర్చించనుంది. ఈ సందర్భంగా గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని రాష్ట్రం కోరనుంది. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనుంది. ఇక సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలిచ్చారు.

ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్‌ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు,  తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనుంది.

104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్ల్‌ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఇదే సమయంలో అధికారులకు సీఎం.. కీలక అదేశాలు ఇచ్చారు.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో హైపర్‌ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్‌ చేయడం అన్నది చాలా ముఖ్యమని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్‌ ల్యాబ్స్‌ తప్పనిసరిగా పెట్టాలన్న సీఎం.. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు.

వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య–ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్న సీఎం.. తల్లి గర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్‌ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్‌ చేయడానికి  సులభతరం అవుతుందని, పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్‌ చేయడం కూడా సులభతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు.

మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను, బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏ రకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో, మహిళా సాధికారిత దిశలో చేయతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను రాష్ట ప్రభుత్వం వివరించనుంది. దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరించడంతో పాటు, దాదాపు 30వేలకుపైగా ఇంటర్‌వెన్షన్స్‌ జరిగిన విషయాన్ని హైలెట్‌ చేయనుంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం.. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్‌ సెంటర్లు ఉపయోగపడతాయన్న సీఎం.. నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలని సీఎం సూచించారు.

‘‘స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి.. ప్రభుత్వం సొమ్మ రూ.371 కోట్లను దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్‌ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.’’ అని సీఎం అన్నారు.
చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే..

ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రభుత్వం వివరించనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్‌ రంగంలో సాధించిన ప్రగతిని ప్రభుత్వం వివరించనుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనుంది. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని రాష్ట్రం వివరించనుంది. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని ప్రభుత్వం వివరించనుంది. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు  అంశాన్నీ కేంద్రం ప్రస్తావించనుంది.

నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగాలన్న సీఎం.. పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు.. వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం.. బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
చదవండి: ‘సివిల్స్‌’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top