Breadcrumb
Live Updates
చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’: అప్డేట్స్
చిరు వ్యాపారులకు జగనన్న తోడు
లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను సీఎం జమ చేశారు.
ఆ ఘనత సీఎం జగన్కే దక్కాలి: లబ్ధిదారులు
గతంలో లోన్లు తీసుకోవాలంటే బ్యాంకులు చుట్టూ తిరిగేవాళ్లమని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసిన ఒక్కరోజులోనే రుణాలు మంజూరవుతున్నాయని, ఆ ఘనత సీఎం జగన్కే దక్కాలని లబ్ధిదారులు అన్నారు. గతంలో వచ్చే లాభం అంతా వడ్డీకే సరిపోయేదన్నారు. ‘జగనన్న తోడు’తో వడ్డీ భారం తగ్గిందన్నారు.
చిరు వ్యాపారులకు బాసటగా..
చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని సీఎం జగన్ కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నామని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి వడ్డీకి లేని రుణాలు ఇస్తున్నామన్నారు. ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను జమ చేస్తున్నామన్నారు.
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారని సీఎం అన్నారు.
కాసేపట్లో బటన్ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం జగన్
నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందచేస్తూ స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఊతం అందిస్తున్న విషయం తెలిసిందే. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది 3.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు...
లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆర్నెల్లకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తోంది. రుణం తీరిన లబ్ధిదారులకు బ్యాంకులు తిరిగి వడ్డీలేని రుణాలిస్తాయి. అర్హత కలిగి ఉండీ జాబితాలో పేర్లు నమోదు కానివారు గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించవచ్చు లేదా సమీప సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులందరికీ వడ్డీ లేని రుణాలు..
ఈ పథకం ద్వారా బుధవారం అందించే రూ.395 కోట్లతో కలిపి ఇప్పటివరకు 15,03,558 మంది లబ్ధి దారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ.2,011 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మందికి ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.48.48 కోట్లు. చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా అర్హులందరికీ ఈ పథకం ద్వారా వడ్డీ లేని బ్యాంకు రుణాలను ప్రభుత్వం సమకూరుస్తోంది.
వీరందరికీ జగనన్న తోడు..
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు విక్రయిస్తూ జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్ సైకిళ్లు, ఆటోలపై తిరిగి వ్యాపారం చేసుకునేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తి కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడ్డ వారు లబ్ధిపొందనున్నారు.
రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్.. ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
3.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’
చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం కల్పించే జగనన్న తోడు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందచేస్తూ స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఊతం అందిస్తున్న విషయం తెలిసిందే. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది.
Related News By Category
Related News By Tags
-
జగనన్న రాకతో ధైర్యమొచ్చింది..!
జగనన్న అంటే ప్రజల గళం.. జగనన్న అంటే ప్రజల బలం.. జగనన్న అంటే ప్రతి ఇంటి వెలుగు.. జగనన్న అంటే ప్రతి మనసు నమ్మకం.. జగనన్న అంటే ప్రజల ఆశ.. జగనన్న అంటే ప్రజల విజయం.. జగనన్న అంటే మన అందరి భవిష్యత్తు.. ఓవరాల...
-
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహ...
-
విజయ్ దివస్: అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. విజయ్దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో దేశ విజయం కోసం ప్రా...
-
రాజేష్తో వైఎస్ జగన్ స్పెషల్ సెల్ఫీ
సాక్షి, కృష్ణా జిల్లా: జనాల్లో ఉన్న వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల ప్రేమను గౌరవంగా తీసుకుని, వారితో దగ్గరగా కలిసిపోవడం ఆయన శైలి. ఆ అభిమానానికి ఆయన...
-
జోజి నగర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ...


