వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

CM Jagan Attend YSRCP Leader Balarami Reddy Son Marriage Reception - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో.. బుధవారం పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామతేజేశ్వర్‌ రెడ్డిలను ఆశీర్వదించారు సీఎం జగన్‌.

నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకకు హాజరైన వారికి అభివాదం చేసిన సీఎం జగన్‌.. అక్కడికి వచ్చిన వాళ్లను అక్కున చేర్చుకుని ఆప్యాయంగా పలకరించారు కూడా.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top