దుర్గమ్మకు రూ.7.50 లక్షల ఆభరణాల సమర్పణ  | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు రూ.7.50 లక్షల ఆభరణాల సమర్పణ 

Published Tue, May 2 2023 4:29 AM

Chennai resident donates Rs 5 lakh for Nithyandanan - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రూ.7.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పించారు. హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన డి.వెంకట సత్యవా­ణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 104 గ్రాముల బంగారపు లక్ష్మీకాసుల హారం, 29 గ్రా­ముల బంగారపు పచ్చల నక్లెస్, 391 గ్రా­ము­ల వెండి పళ్లెం దేవస్థానానికి సమర్పించారు.

వీటిని అ­మ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని దాత కోరా­రు. కాగా, దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి చె­న్నై ఇందిరానగర్‌కు చెందిన భోగరం వెంకట మా­ర్కాం­డేయ శర్మ కుటుంబం రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందచేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement