‘నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం’ | Chandrababu Naidu On Quality Power | Sakshi
Sakshi News home page

‘నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం’

Jul 16 2024 10:52 AM | Updated on Jul 16 2024 10:59 AM

Chandrababu Naidu On Quality Power

అమరావతి:’రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement