సెక్యూరిటీల ద్వారా రూ.3,800 కోట్లు అప్పు
నోటిఫై చేసిన ఆర్బీఐ
సాక్షి, అమరావతి: మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను చంద్రబాబు సర్కారు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పరిధిలో రూ.3,800 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.


