సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు సకాలంలో నిధులు విడుదల చేసి సహకరించాలని కేంద్ర జలశక్తి శాఖ నూతన కార్యదర్శి పంకజ్ కుమార్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాతో కలిసి పంకజ్కుమార్తో బుగ్గన భేటీ అయ్యారు. అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. ‘నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్కు పోలవరం పురోగతి, ఇతరత్రా కార్యక్రమాలు వివరించాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత టీడీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లపై..కొన్ని నెలలుగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలు వివరించాం.
వీటిని పరిశీలించి 2014లో కేంద్ర మంత్రివర్గం తీర్మానం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరాం. అలాగే పౌరవిమాన యాన కార్యదర్శి కరోలాతోనూ భేటీ అయ్యాం. కర్నూలు విమానాశ్రయం నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టి త్వరలోనే ప్రారంభించాలని కోరాం. అదే విధంగా విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను శుక్రవారం కలిసి రివర్స్ పంపింగ్తో తక్కువ ఖర్చుతో విద్యుత్ ద్వారా నీరు నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు హైడల్ పవర్స్ ప్రొడ్యూస్ చేసే అప్పర్సీలేరు ప్రాజెక్టుకు సహకరించాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టును మోడల్ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరాం.
గత ప్రభుత్వాలు తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశాం. పాత అప్పులు, ఖర్చులు తగ్గించే యత్నంలో భాగంగా ఆర్కేసింగ్తో చర్చలు జరిపాం. కేంద్ర బడ్జెట్కు సంబంధించి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు చేశాం. రాష్ట్రానికి జరపాల్సిన కేటాయింపులు ఆలస్యం చేయొద్దని కోరాం. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి ఆ అంశాన్ని ప్రస్తావించాం. పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని, విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలపై దృష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి అన్నింటా సహకరించాలని కోరాం’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.
పోలవరానికి సహకరించండి
Published Sat, Jan 30 2021 5:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement