Andhra Pradesh: Auditor Gannamaneni Venkateswara Rao Other 2 Kidnapped Vizag - Sakshi
Sakshi News home page

విశాఖ కిడ్నాప్‌ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో నలుగురు దుండగులు

Jun 15 2023 12:24 PM | Updated on Jun 15 2023 3:18 PM

Auditor Gannamaneni Venkateswara Rao Other 2 Kidnapped Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడుని దుండగులు కిడ్నాప్‌ చేశారు. ముగ్గురిని అపహరించి రూ. 50 కోట్లు డిమాండ్‌ చేశారు.

అయితే కిడ్నాప్‌ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును పోలీసులు చేధించారు. నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్‌గా పోలీసులు గుర్తించారు. 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు.

కాగా గన్నమనేని గతంలో వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం వైఎస్సార్‌సీపీ పరిశీలకులుగా బధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగేఓ ఎంపీ వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement