ప్రశాంతంగా ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ | AU engineering entrance test records 93 Percent attendance: AP | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌

May 6 2025 5:00 AM | Updated on May 6 2025 5:00 AM

AU engineering entrance test records 93 Percent attendance: AP

93.46 శాతం విద్యార్థులు హాజరు

నేడు ప్రిలిమినరీ కీ,  9న ఫలితాల విడుదల

విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌( ఏయూఈఈటీ–2025) సోమవారం ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 6,028 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5,634 మంది హాజరైనట్లు వర్సిటీ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్‌ డీ.ఏ.నాయుడు వెల్లడించారు.

ఎంట్రన్స్‌ పరీక్ష ప్రిలిమినరీ కీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 8 సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని  పేర్కొన్నారు. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. విశాఖ నగరంలోని గాయత్రి విద్యాపరిషత్‌ డిగ్రీ కాలేజీ, బుల్లయ్య కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్‌ తనిఖీ చేసి, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement