
152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను కలిసి ఏపీఆర్ఎస్ఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
సాక్షి, అమరావతి: 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను కలిసి ఏపీఆర్ఎస్ఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ‘30-35 ఏళ్లపాటు రెవెన్యూశాఖలో ఉద్యోగులు సుదీర్ఘమైన సేవలందిస్తారని.. తహశీల్దార్గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేయడం ఉద్యోగి కల’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అటువంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని బొప్పరాజు అన్నారు.