సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తదుపరి సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ

Ap Next Chief Secretary D Sameer Sharma Met Cm Ys Jagan On Sep 13 - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తదుపరి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ సమీర్‌ శర్మ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ నెల 30న ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్ధానంలో సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్‌ మొబిలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు.

చదవండి: 48 గంటల్లో మా భూమిని మాకు అప్పగించారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top