ప్రజలకు గవర్నర్, సీఎం జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

సాక్షి, అమరావతి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జన్మాష్టమి పండుగ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాది. సమాజంలో శాంతి, స్నేహం, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభ దినం ప్రతీకగా నిలుస్తుంది’ అని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు సీఎం జగన్ ఆకాంక్షించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి