వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం | AP CM YS Jagan Condolences To Former Minister Vatti Vasanth Kumar | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

Jan 29 2023 11:02 AM | Updated on Jan 29 2023 2:40 PM

AP CM YS Jagan Condolences To Former Minister Vatti Vasanth Kumar - Sakshi

తాడేపల్లి: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వసంత్ కుమార్ ఆదివారం తెల్లవారు జామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం.

ఆది నుంచి వసంత్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్‌ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ  మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో  పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్‌ విశాఖలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

చదవండి: లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement