సాక్షి, తాడేపల్లి: కేంద్రమంత్రి పెమ్మసాని తనపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లిక్కర్ కేసులో తనను ఇరికించాలని చుస్తున్నారని అసలు లిక్కర్ కేసుతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు? కూటమి నేతలు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అయితే ఈ కేసులకు, బెదిరింపులకు తాము భయపడే రకం కాదని తేల్చిచెప్పారు. తాడేపల్లిలో ఈరోజు ( శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.


