సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా విజయవాడ పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయిటకి రాకూడదని సూచనలు జారీ చేసింది.


