సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు సోమవారం విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒక రోజు ముందు నోటీసు ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్ భవన్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించనని చెబుతూ బెయిల్ పొందిన ధూళిపాళ్ల.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగం డెయిరీ డైరెక్టర్లతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది.
ఈ కేసు దర్యాప్తులో కీలకమైన డెయిరీ డైరెక్టర్లతో సమావేశం కావడమంటే.. వారిని ప్రభావితం చేసేందుకేనని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ధూళిపాళ్లను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు డెయిరీ వ్యవహారాల్లో ధూళిపాళ్ల కుటుంబం పాల్పడిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా డెయిరీకి చెందిన 10 ఎకరాలను తన కుటుంబ ట్రస్ట్కు బదిలీ చేయడం, ఫోర్జరీ పత్రాలతో రూ.153 కోట్లు రుణాలు తీసుకుని దారి మళ్లించడం, ఇటీవల డెయిరీ ఖాతాల నుంచి రూ.50 కోట్లు ట్రస్టుకు మళ్లించడం మొదలైన విషయాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
ఈ కేసులో అరెస్టయినప్పుడు విచారణలో ధూళిపాళ్ల చెప్పినదానికి, ప్రస్తుత విచారణలో చెబుతున్నదానికి పొంతన లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. నిధులు మళ్లించలేదని ధూళిపాళ్ల మొదట్లో వాదించారు. కాగా ఏసీబీ అధికారులు తాజా విచారణలో ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించడంతో కంగుతిన్నారు. దీంతో ఆ నిధుల మళ్లింపునకు ఏవేవో కారణాలు చెబుతూ తన చర్యను సమర్థించుకునేందుకు విఫలయత్నం చేసినట్టు సమాచారం. కానీ సహకార చట్టం నిబంధనలను ఏసీబీ అధికారులు గట్టిగా ప్రస్తావించడంతో ఆయన చాలాసేపు మౌనం వహించారని తెలుస్తోంది.
Dhulipalla Narendra: సాక్షులను ప్రభావితం చేస్తున్నారుగా?
Published Tue, Jun 8 2021 5:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement