సాక్షి, విశాఖ: ఏయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏయూలో మరోసారి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ.. ‘శాఖ’ నిర్వహించాయి. పోలీసుల సమక్షంలో శాఖ నిర్వహించడం వివాదానికి దారి తీసింది. అయితే, నాన్ బోర్డర్స్కు క్యాంపస్లోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ సర్కులర్ ఇచ్చారు. అయినప్పటికీ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్కులర్ను ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లెక్కచేయకుండా శాఖ నిర్వహించారు.


