బుల్లెట్‌పై భారత్ చుట్టేస్తున్న రష్యన్ యువతి..! | Russian Model Manisha Travels Across India Alone On Bullet Bike, Wins Hearts In Andhra Pradesh’s Sileru, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌పై భారత్ చుట్టేస్తున్న రష్యన్ యువతి..!

Jul 16 2026 12:11 PM | Updated on Jul 16 2026 12:20 PM

Russian Model Sola Bullet Bike Journey Across India Reaches Sileru

చారిత్రక కట్టడాలు, ప్రకృతి సౌందర్యాలు, వైవిధ్యభరితమైన సంస్కృతులతో విలసిల్లుతున్న భారతదేశం అంటేనే విదేశీయులకు ఎంతో మక్కువ. ఈ క్రమంలో ఎందరో పర్యాటకులు మన దేశాన్ని సందర్శిస్తుంటారు. అయితే, అందరిలా సాధారణ పర్యాటకం కాకుండా, రష్యాకు చెందిన మనీషా అనే మోడల్‌ చేస్తున్న సాహసయాత్ర ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరి తోడూ లేకుండా, కేవలం ఒక బుల్లెట్‌పై ఒంటరిగా దేశమంతా పర్యటిస్తూ, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెబుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరులో ఆమె ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఆమె ధైర్యసాహసాలను అభినందిస్తున్నారు.

భారతదేశం అంటేనే సంస్కృతీ సంప్రదాయాల నిలయం. చారిత్రక కట్టడాలు, ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుతాలు, వైవిధ్యమైన ఆహారపు అలవాట్లు ప్రపంచ దేశాల పర్యాటకులను నిరంతరం ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది విదేశీయులు నిత్యం మన దేశానికి తరలివస్తుంటారు. కానీ, రష్యాకు చెందిన మనీషా అనే మోడల్‌ చేస్తున్న ప్రయాణం మాత్రం భిన్నమైనది, ఎంతో సాహసోపేతమైనది. ఎవరి తోడూ లేకుండా, కేవలం తన బుల్లెట్‌పై ఒంటరిగా దేశమంతా పర్యటిస్తూ ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 



ఆకస్మికంగా సీలేరులో ప్రత్యక్షం 
ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆమె ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరులో కనిపించారు. స్థానిక దుకాణం వద్దకు వచ్చి నీళ్ల బాటిల్‌ కొనుగోలు చేస్తుండగా స్థానికులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. విలక్షణమైన కేశాలంకరణ, నల్లటి కళ్లద్దాలు, అధునాతన దుస్తులతో ఉన్న మనీషాను చూసి స్థానికులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా మగ తోడు లేకుండా, ఒక్కరే వందల కిలోమీటర్ల మేర బైక్‌పై ప్రయాణం చేస్తున్న ఆమె ధైర్యసాహసాలను చూసి స్థానిక మహిళలు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా, ఆమెను మనస్ఫూర్తిగా అభినందించారు. 

ఐలవ్‌ ఇండియా.. మనీషా అనుభూతులు 
తన ప్రయాణ అనుభవాలను పంచుకున్నారు. నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం. ఐ లవ్‌ ఇండియా.. భారతదేశంలోని అన్ని ప్రాంతాలను చూడాలనే బలమైన లక్ష్యంతోనే రష్యా నుంచి గోవాకు వచ్చాను. అక్కడి నుంచి గత నాలుగు నెలలుగా బుల్లెట్‌ బైక్‌పై దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా.. అని ఆమె తెలిపారు. భారతీయ ప్రజల ఆదరణ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇక్కడి వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలను తాను ఎప్పటికీ మరువలేనని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. 

అందాలు.. వంటకాలు.. అనుభవాలు 
సీలేరు ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూసి ఆమె ముగ్ధులయ్యారు. భారత్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి అన్నిచోట్లా ప్రజలు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఇక్కడి వంటకాల్లో కారం ఘాటుగా ఉన్నప్పటికీ, చాలా రుచికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన్యంలోకి అడుగుపెట్టాక వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా ఉంది.. అని తన సంతోషాన్ని పంచుకున్నారు. 

ప్రయాణంలో సవాళ్లు.. లక్ష్యం వైపు ప్రయాణం 
తన ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఆమె ప్రస్తావించారు. చాలాచోట్ల రహదారులు అధ్వానంగా ఉన్నందున ప్రయాణానికి కొంత ఇబ్బంది కలుగుతోంది.. అని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా, గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో తన లక్ష్యం వైపు సాగిపోతున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు కన్యాకుమారి, రామేశ్వరం, కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్‌ వంటి ప్రాంతాలను చుట్టి వచ్చానని, దేశంలోని మరిన్ని ప్రాంతాలను చూడటమే తన ముందున్న లక్ష్యమని మనీషా వివరించారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ఇక్కడి విశిష్టతను విదేశీ వనిత అయిన మనీషా ప్రశంసించిన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement