ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు | 7266 crores for construction of national highways in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

Aug 8 2024 6:40 AM | Updated on Aug 8 2024 9:48 AM

7266 crores for construction of national highways in AP

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ  ప్రతిపాదన మేరకే.. 

2024–25 వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదా­రులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన మేరకే కేంద్ర జాతీ­య రహదారుల అభి­వృద్ధి శాఖ ఆమోద­ముద్ర వేసింది. ఆ మేరకు 2023 డిసెంబర్‌లోనే ప్రతి­పాదనలు పంపింది. కీలకమైన విజయ­వాడ తూర్పు బైపాస్‌తోసహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..
కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. 
వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు
అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్‌ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు
విజయవాడలోని మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.669కోట్లు
చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని  పూర్తిచేసేందుకు రూ.325కోట్లు
గన్నవరం సమీపంలోని గుండు­గొలను ‘గామన్‌ జంక్షన్‌’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.150కోట్లు
జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement