ఏపీలో కొత్తగా 6,235 పాజిటివ్‌ కేసులు | 6235 Coronavirus Positive Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 6,235 పాజిటివ్‌ కేసులు

Sep 21 2020 5:27 PM | Updated on Sep 21 2020 5:40 PM

6235 Coronavirus Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

త 24 గంటల్లో 10,502 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్‌ను జయించారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 56,569 నమూనాలు పరీక్షించగా 6,235 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,749 కు చేరింది. తాజా పరీక్షల్లో 30,085 ట్రూనాట్‌ పద్ధతిలో, 26,484 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 51 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5410 కు చేరింది.

గత 24 గంటల్లో 10,502 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్‌ను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 74,518 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 51,60,700 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.


(చదవండి: కార్పొరేట్‌ ఆస్పత్రుల ‘కరోనా కాటు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement