కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృతి 

నరసన్నపేట: కుక్కల దాడిలో 40 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన సత్యవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా పాశిన నాగేష్‌కు చెందిన 30 గొర్రె, 10 మేక పిల్లలు మృతి చెందాయి. నాగేష్‌ తన ఇంటి ఆవరణలో పెద్ద గూడులో వీటిని ఉంచి ఇతర పనులపై కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే కుక్కల మంద దాడి చేయడంతో జీవాలు చనిపోయాయి. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవండి:
కరోనా బారిన పడి డీఎస్పీ మృతి  
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top