15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు | 15 Tribal Welfare Ashram School students taken ill in Paderu | Sakshi
Sakshi News home page

15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Sep 2 2024 4:17 AM | Updated on Sep 2 2024 4:17 AM

15 Tribal Welfare Ashram School students taken ill in Paderu

జామిగూడ ఆశ్రమ పాఠశాలలో మరోసారి ఘటన

సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వ­స్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యపరీక్షలు నిర్వ­హించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.

50 మంది విద్యార్థినులు డిశ్చార్జి
రెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్‌ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఫుడ్‌ కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ చర్యలు
సాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచా­రణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్‌ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్‌ సేవలు అందిస్తున్న  పైన్‌ క్యాటరింగ్‌ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవ­లను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆది­వారం ప్రకటన విడుదల చేశారు.

కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్‌ సేవ­లను ఉపయోగించుకోవాలని ట్రిపుల్‌ ఐటి అధికా­రులకు సూచించారు. ‘పెండింగ్‌లో ఉన్నఫుడ్‌ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసు­కోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమ­తించొద్దు. ఫుడ్‌ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్‌ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement