
ఉద్యోగం రాదేమోనని యువకుడి బలవన్మరణం
పెద్దవడుగూరు: ఉద్యోగం రాదేమోనని ఆందోళనతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు..కాశేపల్లి గ్రామానికి చెందిన యాపర్ల చెన్నారెడ్డికి ఇద్దరు కుమారులుండగా పెద్దకుమారుడు ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. చిన్నకుమారుడు యాపర్ల సుదర్శన్రెడ్డి(22) కొన్ని నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఆర్మీ సెలక్షన్స్లో రన్నింగ్ పరీక్షలో ఎంపికయ్యాడు. అయినా తనకు ఉద్యోగం వస్తుందో రాదోనని మదనపడేవాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం గుత్తిఅనంతపురం వద్దనున్న సుంకులమ్మతల్లి ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
ఎస్ఆర్ఐటీకి
ఇన్నోవేషన్ అవార్డు
బుక్కరాయసముద్రం: ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా యాజమాన్యం పని చేస్తోందని ప్రిన్సిపాల్ డాక్టర్ బాలక్రిష్ణ పేర్కొన్నారు. కళాశాల ఇన్నోవేషన్ సెల్, క్యాంపస్లో వ్యవస్థాపకత, ఆవిష్కరణ, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడంలో చేసిన అత్యుత్తమ కృషికి 2025 ఇన్నోవేషన్ అవార్డును ఎస్ఆర్ఐటీ కళాశాల అందుకుందన్నారు. ఈ అవార్డును రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కట్టా రామోహన్రావు నుంచి అందుకున్నామన్నారు. ఎస్ఆర్ఐటీ ఆవిష్కరణలు, స్టార్టప్లను పెంపొందించడంలో మెకానికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయుల కృషి, అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. అదే విధంగా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్క్షాపులో కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ థర్డియర్ విద్యార్థి మహమ్మద్ ఇలియాస్ తన ఇన్నోవేషన్ ఇ–వాట్తో ఉత్తమ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్నారన్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన డాక్టర్ ఆంజనేయులను కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సాయిచైతన్య కిశోర్ అభినందించారు.

ఉద్యోగం రాదేమోనని యువకుడి బలవన్మరణం