కడపలో గెలవలేక అనకాపల్లి జిల్లాకు వచ్చి ఏడుపుముఖం పెట్టుకుంటే ఈ ప్రాంత ప్రజలు ఆదరించిన పాపానికి ప్రకృతి సంపదను విధ్వంషం చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్పై మాజీ మంత్రి అమర్నాథ్ ధ్వజమెత్తారు. జిల్లాలో కొండలను, గుట్టలను మింగేస్తూ భారీగా దోచేస్తున్నార ని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు మన ప్రాంతంలో ఉంటే భావితరాలకు, యువతకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు పాలన వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దోపిడీ పాలన సాగుతోందన్నారు. రానున్న ప్రతీ ఎన్నికల్లో జిల్లా కమిటీ గ్రామ స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటూ విజయం సాధించే దశగా పనిచేస్తుందని చెప్పారు.


