నూకాంబిక ఆలయ హుండీ ఆదాయం రూ.80.17 లక్షలు | - | Sakshi
Sakshi News home page

నూకాంబిక ఆలయ హుండీ ఆదాయం రూ.80.17 లక్షలు

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. గత నెల 11 నుంచి ఈనెల 10వ తేదీ వరకు రూ.80,17,580 ఆదాయం రాగా, బంగారం 9 గ్రాముల 100 మిల్లీ గ్రాములు, వెండి 710 గ్రాములు లభించినట్టు దేవదాయశాఖ ఉప కమిషనర్‌ ఎన్‌.సుజాత చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి నూతన ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్‌ కె.ఎల్‌.సుధారాణి, ఆలయ సహాయ కమిషనర్‌ యాళ్ల శ్రీధర్‌, చైర్మన్‌ పీలా నాగశ్రీను, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వంసతరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement