మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు | - | Sakshi
Sakshi News home page

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు

Dec 31 2025 7:16 AM | Updated on Dec 31 2025 7:16 AM

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరప

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌లో అత్యాధునిక టోమోథెరప

ఎంవీపీకాలనీ: క్యాన్సర్‌ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పటల్‌లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్‌ హాస్పటల్‌ ఎండీ డాక్టర్‌ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్‌ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్‌ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్‌ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ దేశంలో లెవల్‌ 3 కేటగిరి హాస్పటల్స్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్‌ ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు.కార్యక్రమంలో పలువురు హాస్పటల్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement