
టంగుటూరి స్ఫూర్తితో దేశ సేవ చేయాలి
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో యువత దేశ సేవ చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా తన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణరావు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రమామణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.