● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య | - | Sakshi
Sakshi News home page

● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య

Aug 20 2025 5:43 AM | Updated on Aug 20 2025 5:43 AM

● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సి

● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సి

● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య

పాయకరావుపేట: కేవలం విద్యనే కాకుండా విద్యార్ధుల్లో అంతర్గతంగా దాగి వున్న నైపుణ్యాలను వెలికి తీసే కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యాలు నిర్వహించాలని ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య అన్నారు. శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల 49 వ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు విద్యా సంస్ధల వివిధ శాఖల విద్యార్ధుల మధ్య గాతా రహే మేరా దిల్‌ పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సీని నేపద్య గాయని కౌసల్య, కీబోర్డ్‌ ప్లేయర్‌ రవి శేఖర్‌ హాజరయ్యారు. గాయని కౌసల్య మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రసిద్ధ గేయ రచయిత ఆనంద్‌ బక్షి పాటలను ఎంపిక చేసుకోవడం ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చిందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారని, నిత్యం సాధన చేస్తే భవిష్యత్‌లో మంచి గాయకులుగా రాణించగలరని అన్నారు. ఈ పోటీలు 6 వ తరగతి నుంచి డిగ్రీ వరకు జూనియర్‌, సీనియర్‌ విభాగాలలో నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కౌసల్యను విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌ సత్కరించారు. సీనియర్‌ ప్రిన్సిపాల్‌ మూర్తి, భానుమూర్తి, డాక్టర్‌ బంగార్రాజు, డా. రామకృష్ణారెడ్డి, బి.సీతారాణి, మేనేజర్‌ శ్రీనివాస్‌, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement