అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 31 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఎస్పీ అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ డి.వెంకన్న పాల్గొన్నారు.