వాతావరణ మార్పులు, విపత్తులపై చర్చ
డాబాగార్డెన్స్: యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. వాతావరణంలో మార్పులు, విపత్తులు, ఎన్ఆర్ఐల రిలేషన్ షిప్లపై చర్చించారు. వాతావరణ మార్పులు, విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కొవాలి అనే అంశంపై పరస్పర సహకారమందించేందుకు అవసరమైన వనరులపై చర్చించారు. యూఎన్డీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా విశాఖలో చేపడతున్న కార్యక్రమాలను కమిషనర్ వారికి వివరించారు. కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు స్టీఫెన్ విల్జెర్, అలెగ్జాండ్రా మేయర్, యూఎన్డీపీ కాన్సులేట్ శ్రీనివాస్ రాజామని పాల్గొన్నారు.