పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

Sep 11 2026 10:04 AM | Updated on Sep 11 2026 10:04 AM

జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగి, కోరాపల్లి పంచాయతీ పరిధిలోని చింతలగొంది, వరదమామిడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ’మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో తహసీల్దార్‌ గిడ్డి రాజ్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు పెద్దబాలన్న గిరిజన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. చింతలగొంది గ్రామంలో మొత్తం 41 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన లబ్ధిదారులు తమ భూములను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయాభివృద్ధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, పాడేరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గబ్బాడి శాంతికుమారి, ఎంపీటీసీ రామారావు, మాజీ సర్పంచ్‌లు కృష్ణమూర్తి, అప్పన్నదొర, ఏ.రామూర్తి, వీఆర్వోలు అనిత, యేసురత్నం, సర్వేయర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

అర్హులందరికీ పట్టాలివ్వాలి

గూడెంకొత్తవీధి: అర్హులైన రైతులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని ఎంపీపీ బోయిన కుమారి కోరారు. గూడెంకొత్తవీధి పంచాయతీ బోనంగిపల్లిలో గురువారం తహసీల్దార్‌ అన్నాజీరావుతో కలిసి 45 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది రైతులకు పట్టాలు అందలేదన్నారు. రీసర్వే అనంతరం వారికి కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిలో స్థానికులు కొర్రా బలరాం, నాగమణి, వీర వెంకట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement