ముగ్గురికి గాయాలు
ఎస్.రాయవరం: మండలంలోని గోకులపాడు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అడ్డురోడ్డు వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుతున్న కారు టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. కారులో సేఫ్టీ బెలూన్లు ఓపెన్ కావడం, ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. ప్రథమ చికిత్స అనంతరం మరో వాహనంలో వారు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.


