రికార్డులను పరిశీలిస్తున్నసీఈవో నారాయణమూర్తి
చీడికాడ: రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసుకోవాలని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఎంపీడీవో కార్యాలయం సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలో ఎంపీడీవో హేమసుందరరావు అందుబాటులో లేకపోవడంతో ఆరా తియ్యగా ఎంపీడీవో ట్రైనింగ్కు వెళ్లినట్టు కార్యాలయ సిబ్బంది చెప్పారు. ఈ మేరకు రికార్డులు పరిశీలించిన ఆయన సరిచేసుకోవాలని ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలైన కోటీశ్వరరావు, ప్రసన్నకుమార్లకు సూచించారు.


