14న లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

14న లోక్‌ అదాలత్‌

Mar 7 2026 7:36 AM | Updated on Mar 7 2026 7:36 AM

మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి షియాజ్‌ ఖాన్‌

నర్సీపట్నం: ఈ నెల 14న లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.షియాజ్‌ ఖాన్‌ పేర్కొన్నారు. పోలీసు, బ్యాంక్‌, మున్సిపల్‌ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీమార్గంలో కేసులు పరిష్కరించేందుకు లోక్‌ అదాలత్‌ చక్కటి వేదికన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి జూనియర్‌ సివిల్‌ జడ్జి స్పందన, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రమేష్‌, సీఐలు, ఎస్సైలు, మున్సిపల్‌ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement