బుధ గురు
అరకు 6.13 5.04 పాడేరు 6.14 5.05
డొకులూరు లేటరైట్ క్వారీపైనేడు ప్రజాభిప్రాయసేకరణ
గూడెంకొత్తవీధి: ఆంధప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మండలంలోని డొకులూరులో లేటరైట్క్వారీ తవ్వకాల తుది అనుమతులకు సంబంఽధించి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని తహసీల్దారు అన్నాజీరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఈకార్యక్రమానికి హాజరవుతారన్నారు. లేటరైట్ తవ్వకాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలుఉంటే వాటిని ఈసదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను నేరుగా అధికారులకు తెలియజేయాలని కోరారు. మేథావులు, ప్రజాప్రతినిధులు, గిరిజనులు హాజరుకావాలని ఆయన కోరారు.


